ఐక్యరాజ్యసమితి విశేషాలు
}ఐరాస సెక్రటరీ జనరల్గా గ్యుటెరస్ ప్రమాణస్వీకారం
ఐక్యరాజ్యసమితి
నూతన సెక్రటరీ జనరల్గా పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గ్యుటెరస్ డిసెంబర్ 12న ప్రమాణ
స్వీకారం చేశారు.
}ప్రస్తుత సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ పదవీ కాలం డిసెంబర్ 31తో
ముగియనుంది.
}భద్రతామండలి సంస్కరణలకు జీ-4 డిమాండ్ఐక్యరాజ్యసమితి
భద్రతా మండలిలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని జీ-4 దేశాలు (భారత్, బ్రెజిల్, జర్మనీ,
జపాన్) డిమాండ్ చేశాయి.
}21వ శతాబ్దపు భౌగోళిక,
రాజకీయ వాస్తవికతల దృష్ట్యా.. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి.. తాము
న్యాయబద్ధమైన అభ్యర్థులమని పేర్కొన్నాయి.
}యునిసెఫ్ అంబాసిడర్గా ప్రియాంకయునిసెఫ్ గ్లోబల్ గుడ్విల్ కొత్త ప్రచారకురాలిగా
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నియమితులయ్యారు.
}ఐక్యరాజ్యసమితిలో అంబేడ్కర్ జయంతి
ఐక్యరాజ్యసమితిలో తొలిసారి ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ (125వ) జయంతి
వేడుకలను నిర్వహించారు.
}ఈ వేడుకల్లో ఐరాస అభివృద్ధి కార్యక్రమం నిర్వాహకురాలు,
న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్, ఐరాస లోని భారత శాశ్వత
ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
}2030 అభివృద్ధి అజెండా సాధనకు, అంబేడ్కర్ ఆశయాల
మేరకు ప్రపంచవ్యాప్తంగా పేద, బడుగు వర్గాల అభివృద్ధికి భారత్తో కలిసి కృషి
చేస్తామని క్లార్క్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుస్థిర అభివృద్ధి ఆశయ సాధనకు
అసమానతలపై పోరు అనే అంశంపై చర్చ జరిగింది.
ఐరాస అత్యవసర నిధికి భారత్
ఆర్థిక సాయం
}ఐక్యరాజ్య సమితి అత్యవసర నిధికి భారతదేశం 5 లక్షల
అమెరికన్ డాలర్ల ఆర్థికసాయాన్ని ప్రకటించింది.
}డిసెంబర్ 14న జరిగిన శిఖరాగ్ర సమావేశంలో భారత దౌత్యవేత్త
అంజనీ కుమార్ 2016-17 సంవత్సరానికి భారత్ తరఫున ఈ సహాయాన్ని ప్రకటించారు.
}యూఎన్(UN)లో అత్యవసర నిధిని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ 60 లక్షల డాలర్లను అందించింది.
No comments:
Post a Comment