నల్లధనం వెల్లడకి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు
ప్రధాని
గరీబ్ కల్యాణ్ యోజన పథకం ప్రారంభం
}పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో జమవుతున్న నల్లధనాన్ని (ఆదాయ
వివరాలు వెల్లడించనిది) సమర్థంగా వినియోగించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాని గరీబ్ కల్యాణ్
యోజన (పీఎం జీకేవై)-2016 పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించింది.
}దీని కింద ఆదాయ వివరాల లెక్కచెప్పని మొత్తంపై 50% పన్ను విధిస్తారు.
}మిగిలిన దానిలో 25 శాతంను తప్పనిసరిగా పీఎంజీకేవై(PMGKY) లో జమ
చేయాలి.
}దీనిపై నాలుగేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఎలాంటి వడ్డీ కూడా ఉండదు.
}మిగిలిన 25 శాతంను వెంటనే విత్డ్రా
చేసుకోవచ్చు.
}ఈ మేరకు నవంబర్ 28న ఆదాయ పన్ను(ఐటీ) చట్టం సవరణ బిల్లులో ప్రతిపాదనలు చేర్చారు.
}ఈ స్కీమ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని పేదరిక నిర్మూలన, మౌలిక
సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం వెచ్చిస్తారు.
}పీఎంజీకేవైను ఫైనాన్స్ చట్టం-2016లో చాప్టర్ 9 కింద
చేర్చారు.
ఐడీఎస్ కింద 65 వేల కోట్ల
నల్లధనం వెల్లడి
}నల్లధనాన్ని వెలికి తీయడానికి మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఆదాయ వెల్లడి పథకం (Income
Declaration Scheme) లో భాగంగా దేశవ్యాప్తంగా రూ.65,250 కోట్ల నల్లధనం బహిర్గతమైంది.
}మొత్తం 64,275 మంది తమ అక్రమాదాయాన్ని
బయటపెట్టారు. దీనిలో పన్నుల రూపంలో రూ. 29,362 కోట్లు
ప్రభుత్వానికి సమకూరనుంది.
}ఇందులో రూ.14,700 కోట్లు ఈ ఆర్థిక
సంవత్సరంలో సమకూరనున్నాయి.
} పన్ను చెల్లించని
ఆదాయాన్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ప్రభుత్వం విధించిన గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది.
}వెల్లడించిన అదాయం ప్రకారం దాదాపు రూ. 13 వేల
కోట్లతో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో ముంబై(రూ. 8,500
కోట్లు), ఢిల్లీ(రూ. 6 వేల కోట్లు), కోల్కతా(రూ. 4 వేల కోట్లు) ఉన్నాయి.
}2016 జూన్ 1న ఐడీఎస్ను
తీసుకొచ్చారు.
}ఈ పథకం వన్టైమ్ సెటిల్మెంట్ కింద 45 శాతం
పన్ను, పెనాల్టీ చెల్లించే వీలు కల్పించింది.
}విదేశాల్లో దాచిన భారతీయుల నల్లధనానికి సంబంధించి 2015లో
ప్రకటించిన ఇదే తరహ పథకం ద్వారా రూ. 2,428 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. కేవలం
644 మందే దీనికి స్పందించారు.
ఐటీ చట్ట సవరణ బిల్లుకు
లోక్సభ ఆమోదం
}ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని ప్రారంభించేందుకు
ఉద్దేశించిన ఆదాయపు పన్ను చట్ట సవరణ బిల్లు 2016ను నవంబర్ 29న లోక్సభ
ఆమోదించింది.
}రద్దయిన రూ. వెయ్యి, రూ. 500 నోట్లను చట్టవిరుద్ధంగా మార్చే వారిని కట్టడి చేయడానికి
ఈ బిల్లును ప్రతిపాదించారు.
}దీని ప్రకారం రద్దయిన కరెన్సీని అక్రమంగా మార్చే వారిపై 60% పన్ను, పెనాల్టీలతో కలిపి గరిష్టంగా 85% వసూలు
చేస్తారు.
}స్వయంగా నల్లధనం వివరాలు సమర్పిస్తే 50% పన్ను విధించి 25%
నగదును వెంటనే తీసుకునే వెసులుబాటు కల్పిండంతో పాటు, మిగతా 25% నాలుగేళ్ల అనంతరం
తీసుకునేలా ప్రతిపాదనలు చేర్చారు.
No comments:
Post a Comment