న్యూఢిల్లీలో బ్రిక్స్
ఆరోగ్య మంత్రుల సమావేశం
}క్షయ, హెచ్ఐవీ, మలేరియా లాంటి జబ్బులను
ఎదుర్కొనేందుకు పరిశోధనలను మరింత ప్రోత్సహించాలని బ్రెజిల్, రష్యా, భారత్, చైనా,
దక్షిణాఫ్రికా (బ్రిక్స్ దేశాలు) నిర్ణయించాయి.
}ఈ మేరకు న్యూఢిల్లీలో డిసెంబర్ 16న ముగిసిన ఆరో బ్రిక్స్ ఆరోగ్య
మంత్రుల సమావేశం
ఢిల్లీ డిక్లరేషన్ను ఆమోదించింది
వ్యవసాయ ఎగుమతుల రాయితీలను
ఎత్తేసిన బ్రిక్స్
}న్యూఢిల్లీలో సెప్టెంబర్ 23న జరిగిన
బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల వ్యవసాయ మంత్రుల
సమావేశం వ్యవసాయ ఎగుమతుల రాయితీలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.
} 2015, డిసెంబర్లో నైరోబిలో జరిగిన ప్రపంచ వాణిజ్య
సంస్థ (డబ్ల్యూటీవో) మంత్రుల స్థాయి సమావేశంలో కుదిరిన అంగీకారం మేరకు, ఈ నిర్ణయం
తీసుకున్నట్లు బ్రిక్స్ దేశాల వ్యవసాయ మంత్రులు ఉమ్మడి ప్రకటన చేశారు.
బ్రిక్స్ దేశాల మహిళా
పార్లమెంటేరియన్ల సదస్సు
}జైపూర్లో రెండు రోజులపాటు జరిగిన బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు ఆగస్టు 21న
ముగిసింది.
}లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ వాతావరణ
మార్పు పరిణామాలను ఎదుర్కోవడం, మహిళల సంక్షేమాన్ని పెంపొందించడంపై బ్రిక్స్ దేశాలు
అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.
}సదస్సు ముగింపులో ఆమోదించిన జైపూర్ డిక్లరేషన్.. ఆర్థిక వృద్ధి, సామాజిక
సమ్మిళితం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో పరస్పర సహకారం, వ్యూహాత్మక
భాగస్వామ్యాల పటిష్టతకు మహిళా పార్లమెంటేరియన్లు ప్రతినబూనాలని పేర్కొంది.
బ్రిక్స్-బిమ్స్టెటెక్
సదస్సు
}అక్టోబర్ 16న గోవాలో జరిగిన బ్రిక్స్-బిమ్స్ టెక్(బంగాళాఖాత
దేశాల సాంకేతిక, ఆర్థిక సహకార వేదిక) సదస్సులో సభ్యదేశాలనుద్దేశించి ప్రధాని మోదీ
మాట్లాడారు.
}ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాధినేతలతో పాటు షేక్ హసీనా (బంగ్లాదేశ్),
మైత్రిపాల సిరిసేన (శ్రీలంక), ప్రచండ (నేపాల్), ఆంగ్సాన్ సూచీ (మయన్మార్),
సెరింగ్ తోబ్గే (భూటాన్), థాయ్లాండ్ విదేశాంగ సహాయ మంత్రి పాల్గొన్నారు.
బ్రిక్స్ దేశాల పర్యావరణ
మంత్రుల సమావేశం
}ద క్షిణ గోవాలో రెండు రోజుల పాటు జరిగిన
బ్రిక్స్ దేశాల పర్యావరణ మంత్రుల సమావేశం సెప్టెంబర్ 16న ముగిసింది.
}ఈ సమావేశంలో హరిత సంబంధిత అంశాలపై పరస్పర సహకారానికి సంయుక్త కార్యాచరణ బృందాన్ని
ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
విశాఖలో పట్టణీకరణపై బిక్స్ సదస్సు
}విశాఖపట్నంలో సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు పట్టణీకరణపై బ్రిక్స్
దేశాల సదస్సు జరిగింది.
}ఈ సదస్సులో పట్టణీకరణ ఆవశ్యతక, దాని వల్ల తలెత్తే సమస్యలపై
ప్రధానంగా చర్చించారు.
}సమావేశాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి వెంకయ్య
నాయుడు 2011 నాటికి 32 శాతం ఉన్న పట్టణీకరణ 2050 నాటికి 70 శాతానికి
పెరుగుతుందని చెప్పారు.
}దేశంలో 2011లో పట్టణ జనాభా 377 మిలియన్లు కాగా రానున్న 15
ఏళ్లలో 600 మిలియన్లకు చేరుతుందని తెలిపారు.
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు
బ్రిక్స్ దేశాల పిలుపు
}ప్రపంచ దేశాలన్నీ తమ భూభాగాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు
అడ్డుకట్ట వేయాలని, ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఐక్యరాజ్య సమితి తీర్మానానికి త్వరితంగా ఆమోదం
తెలపాలని బ్రిక్స్
దేశాల సదస్సు కోరింది.
}గోవాలో జరిగిన వార్షిక సదస్సులో సభ్య దేశాలు.. బ్రెజిల్, రష్యా,
భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు ఈ మేరకు తీర్మానిస్తూ అక్టోబర్ 16 ప్రకటన (గోవా డిక్లరేషన్) విడుదల
చేశాయి.
}ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న వ్యవస్థీకృత నేరాలైన మనీ లాండరింగ్, మాదక
ద్రవ్యాల అక్రమ రవాణాను నిర్మూలించడంతోపాటు ఉగ్రవాదుల స్థావరాల్ని నాశనం చేయడం, ఇంటర్నెట్ ద్వారా
ఉగ్రవాద అనుకూల ప్రచారాన్ని తిప్పికొట్టడంపై ప్రధానంగా దృష్టి సారించాలని సదస్సు
పేర్కొంది.
No comments:
Post a Comment