పార్లమెంటులో ఆమోదం పొందిన వివిధ బిల్లులు
దివ్యాంగుల హక్కుల
బిల్లుకు రాజ్యసభ ఆమోదం
}దివ్యాంగులకు భద్రత కల్పించి వారి హక్కులను కాపాడటానికి ఉద్దేశించిన దివ్యాంగుల హక్కుల
బిల్లు-2014ను రాజ్యసభ
డిసెంబర్ 14న ఆమోదించింది.
}బిల్లు ప్రకారం దివ్యాంగులుగా గుర్తించేందుకు ఉండాల్సిన వైకల్యాల జాబితాను 7 నుంచి
21కి పెంచారు.
}అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను మూడు నుంచి నాలుగు శాతానికి
పెంచారు.
}దివ్యాంగులపై వివక్ష పాటిస్తే 6 నెలల నుంచి రెండేళ్ల దాకా
జైలుశిక్షతో పాటు రూ. 10 వేల నుంచి 5 లక్షల దాకా జరిమానా విధించవచ్చు.
ప్రసూతి ప్రయోజన బిల్లుకు
రాజ్యసభ ఆమోదం
}ప్రసూతి సెలవులను 12 నుంచి 26
వారాలకు
పెంచే మెటర్నిటీ
బెనిఫిట్ యాక్ట్ 1961 సవరణ బిల్లును రాజ్యసభ ఆగస్టు 10న ఆమోదించింది.
}ఈ బిల్లు ఇప్పటికే లోక్సభ ఆమోదం కూడా పొందింది. ఈ బిల్లు
చట్టమైతే వ్యవస్థీకృత
రంగంలో
పనిచేస్తున్న 18 లక్షల మంది ఉద్యోగినులకు ప్రయోజనం చేకూరుతుంది.
}ప్రపంచంలో నార్వే, కెనడాలు అత్యధికంగా 44 వారాల పాటు ప్రసూతి సెలవులను
కల్పిస్తున్నాయి.
}ప్రస్తుత బిల్లుతో భారత్ అత్యధిక ప్రసూతి సెలవులు కల్పించే దేశాల వరుసలో మూడో స్థానంలో
నిలుస్తుంది.
}ఈ బిల్లు ప్రకారం 26 వారాలకు పూర్తి జీతంతో కూడిన సెలవును, కనీసం 10 మంది
ఉద్యోగులున్న అన్ని సంస్థలూ మంజూరు చేయాల్సి
ఉంటుంది.
బాలలను పనిలో పెట్టుకుంటే
2 ఏళ్ల జైలు
}14 ఏళ్ల కంటే తక్కువ వయసున్న
బాలలను పనిలో పెట్టుకునేవారికి రెండేళ్ల జైలు శిక్ష విధించేలా
తీసుకొచ్చిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది.
}బాల కార్మికుల (నిషేధ, నియంత్రణ) సవరణ బిల్లుకు రాజ్యసభ గతంలోనే ఆమోదం
తెలపగా, జూలై 26న లోక్సభ కూడా ఆమోద ముద్ర వేసింది.
}దీంతో గతంలో ఆరు నెలలున్న జైలు శిక్ష రెండేళ్లకు, రూ.10 వేల జరిమానా రూ. 20 వేలకు, రూ.20 వేల జరిమానా రూ. 50 వేలకు పెరగనుంది.
అమల్లోకొచ్చిన బినామీ
లావాదేవీల సవరణ చట్టం
}నల్లధనం కట్టడిలో భాగంగా బినామీ లావాదేవీలను నిషేధించడానికి
ఉద్దేశించిన బినామీ లావాదేవీల (నిషిద్ధ) సవరణ చట్టం-2016 అమల్లోకి వచ్చింది.
}1988 బినామీ లావాదేవీల
నిషేధిత చట్టంకు సవరణలు చేసి దీనిని ప్రతిపాదించారు. దీని ప్రకారం ఆదాయానికి
మించిన, లెక్క చెప్పలేని ఆస్తులు జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
}ఏడాది నుంచి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు మార్కెట్
విలువ ప్రకారం బినామీ ఆస్తి విలువలో 25 శాతం జరిమానా విధించవచ్చు.
}బినామీ లావాదేవీలపై తప్పుడు సమాచారమిస్తే ఆరు నెలల నుంచి
అయిదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు ఆస్తి విలువలో 10 శాతం జరిమానా విధించవచ్చు.
రుణ వసూలు బిల్లుకు
లోక్సభ ఆమోదం
}రుణ గ్రహీతలు తీసుకున్న మొత్తాన్ని నిర్ణీత సమయంలో చెల్లించని పక్షంలో వారు
తాకట్టుపెట్టిన
ఆస్తులను జప్తు
చేసుకునే అధికారాన్ని బ్యాంకులకు కల్పించే చట్టానికి లోక్సభ మూజువాణీ ఓటుతో ఆమోదం తెలిపింది.
}అయితే ఈ బిల్లు నుంచి వ్యవసాయ భూమికి
మినహాయింపునిచ్చారు.
}‘ఎన్ఫోర్స్ మెంట్ ఆఫ్
సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అండ్ రికవరీ ఆఫ్ డెట్ లాస్ అండ్ మిస్లేనియస్
ప్రావిజన్స్(సవరణలు) బిల్లు-2016’ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో ప్రవేశపెట్టారు.
}సర్ఫాసీ, డీఆర్టీ, స్టాంపు చట్టం, డిపాజిటరీ చట్టాలకు సవరణలు చేసి ఈ చట్టాన్ని
తీసుకొచ్చారు.
}రుణదాతలు డీఫాల్టర్ ఆస్తులను స్వాధీనం చేసుకునే
అధికారమిస్తూ.. జిల్లా మెజిస్ట్రేట్ ఈ వ్యవహారాన్ని 30 రోజుల్లో పూర్తి చేసేలా సవరణ
తెచ్చారు.
No comments:
Post a Comment