సినిమా థియేటర్లలో
‘జనగణమన’ తప్పనిసరి
}ప్రజల్లో దేశభక్తి, జాతీయభావాన్ని పెంపొందించేందుకు సినిమా
హాళ్లలో జాతీయ గీతం ‘జనగణమన’ను తప్పనిసరిగా ప్రదర్శించాలని సుప్రీంకోర్టు నవంబర్ 30న
ఆదేశాలు జారీ చేసింది
త్రిపుల్ తలాక్ రాజ్యాంగ
విరుద్ధం: అలహాబాద్ హైకోర్టు
}ముస్లిం మహిళల హక్కులను కాలరాసే ట్రిపుల్ తలాక్ క్రూరమైనదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
}తక్షణ విడాకులైన ‘ట్రిపుల్ తలాక్’ ఒక దేశంగా భారత్ ఉండకుండా
అడ్డుకుంటోందని ఆందోళన వ్యక్తం చేసింది.
}ఏ సామాజిక వర్గానికి చెందిన పర్సనల్ లా అయినా రాజ్యాంగం
కల్పించిన హక్కులకు అతీతం కాదని చెప్పింది.
}యూపీకి చెందిన హినా(23), ఆమె భర్త దాఖలు చేసిన పిటిషన్ను
కొట్టివేస్తూ కోర్టు ఈ తీర్పు వెలువరిచింది.
సింగూరు భూమి
రైతులకిచ్చేయండి: సుప్రీంకోర్టు
}పశ్చిమ బెంగాల్లోని సింగూరు భూసేకరణను
సుప్రీంకోర్టు ఆగస్టు 31న కొట్టేసింది.
}గతంలో రైతులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారాన్ని వెనక్కి
తీసుకోరాదని, పదేళ్లపాటు రైతులు భూమికి దూరంగా ఉన్నందున ఆ మొత్తం రైతులకే
చెందుతుందని తీర్పు చెప్పింది.
}టాటా సంస్థ నానో కార్ల తయారీ
కేంద్రం ఏర్పాటు కోసం పదేళ్ల కిందట అప్పటి వామపక్ష ప్రభుత్వం సింగూరులో
భూసేకరణ చేసింది.
ఢిల్లీపై పాలనాధికారాలు
లెఫ్టినెంట్ గవర్నర్కే
}రాజ్యాంగాన్ని అనుసరించి ఢిల్లీ.. కేంద్ర పాలిత ప్రాంతం గానే
కొనసాగుతుందని, లెఫ్టినెంట్ గవర్నరే (ఎల్జీ) దానికి పాలనాధిపతి అని ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 4న
స్పష్టం చేసింది.
}ఢిల్లీ రాష్ట్ర మంత్రివర్గ సూచనల మేరకు ఎల్జీ పనిచేయాల్సిన
అవసరం లేదని, ఆయన అనుమతి లేకుండా ప్రభుత్వ నోటిఫికేషన్ల జారీ
అక్రమమని పేర్కొంది.
}దేశ రాజధాని ప్రాంతం (ఎస్సీటీ) పాలనా వ్యవహారాల్లో
అధికారాలపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన పలు
పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది.
తెలుగు ప్రాచీన భాషే:
మద్రాస్ హైకోర్టు
}తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం
సమంజసమేనని మద్రాసు
హైకోర్టు ఆగస్టు 8న
తీర్పు చెప్పింది.
}తెలుగు, కన్నడం, మలయాళం, ఒడియా భాషలకు కేంద్రం కల్పించిన
ప్రాచీన
హోదా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ చెన్నైకి చెందిన
ఆర్ గాంధీ అనే సీనియర్ న్యాయవాది మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన
వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.
}రెండువేల ఏళ్లకు పైగా చరిత్ర, భాష, సంస్కృతి, వ్యాకరణం,
సాహిత్యపు విలువలు.. వీటిల్లో ఏ ఒక్క అర్హతా లేని భాషలకు కేంద్రం ఇష్టారాజ్యంగా
ప్రాచీన హోదా కల్పించిందని, దీనిని రద్దుచేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.
స్వలింగ సంపర్కులు మూడో
లింగ పరిధిలోకి రారన్న సుప్రీంకోర్టు
}స్వలింగ సంపర్కులను మూడో లింగ (థర్డ్ జెండర్)
వ్యక్తులుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు జూన్ 30న స్పష్టం చేసింది.
}ఈ అంశంపై విచారణ నిర్వహించిన కోర్టు 2014లో (సుప్రీంకోర్టు)
ఇచ్చిన తీర్పు ప్రకారం.. లింగమార్పిడి చేయించుకున్నవారు, హిజ్రాలు మాత్రమే మూడో లింగ
వర్గానికి చెందుతారని, స్వలింగ సంపర్కులు ఆ పరిధిలోకి రారని పేర్కొంది.
No comments:
Post a Comment