ముఖ్యమైన రక్షణరంగ ప్రయోగాలు
యాంటీ-ఎయిర్ఫీల్డ్ ఆయుధ పరీక్ష విజయవంతం
}రన్వేలు, బంకర్లను ధ్వంసంచేసే సత్తా ఉన్న అత్యాధునిక ‘స్మార్ట్
యాంటీ-ఎయిర్ఫీల్డ్’ ఆయుధాన్ని రక్షణ, పరిశోధక అభివృద్ధి సంస్థ డిసెంబర్ 24న
విజయవంతంగా పరీక్షించింది.
}చాందీపూర్- ఒడిశా మధ్య దీని ప్రయోగించారు. స్వదేశీ
పరిజ్ఞానంతో తయారైన 120 కేజీల ఈ ఆయుధం 100 కి.మీ.ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం
చేయగలదు.
అగ్ని-5 ప్రయోగం విజయవంతం
}అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణి అగ్ని-5 ను
డీఆర్డీవో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు.
}ఒడిశాలోని బాలాసోర్లో ఉన్న అబ్దుల్ కలాం ద్వీపం నుంచి డిసెంబర్ 26 దీనిని
పరీక్షించారు.
}అగ్ని-5 పరిధి 5-6 వేల కిలోమీటర్లు. 17 మీటర్ల
పొడవు, 50 టన్నుల బరువు, రెండు మీటర్ల వ్యాసార్థమున్న ఈ క్షిపణి 1,500 కిలోల
అణ్వాయుధాలను
మోసుకెళ్లగలదు.
}తాజా ప్రయోగంతో ఖండాంతర లక్ష్యాలను ఛేదించగల క్షిపణి
సామర్థ్యం ఉన్న దేశాలు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ల సరసన ఇండియా
చేరింది
యూఏవీ రుస్తుం-2 తొలి
పరీక్షలు విజయవంతం
}దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మానవ రహిత వైమానిక వాహనం
(యూఏవీ) రుస్తుం-2 (తపస్-201) తొలి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. రెండు
టన్నుల బరువు ఉండే రుస్తోం మధ్యస్థ స్థాయి ఎత్తుల్లోని లక్ష్యాలపై దాడి చేయగలదు.
}దీనిని డీఆర్డీవో (బెంగళూరు), హెచ్ఏఎల్-బీఈఎల్లు
సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
పృథ్వీ-2 విజయవంతం
}దేశీయ పరిజ్ఞానంతో తయారై, అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం
కలిగిన పృథ్వీ-2 క్షిపణిని ఆర్మీ విజయవంతంగా పరీక్షించింది.
}ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే
సామర్థ్యం కలిగిన ఈ క్షిపణి 350 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని
కచ్చితంగా ఛేదించడంతో పాటు 500-1000 కిలోల బరువున్న వార్హెడ్లను మోసుకెళ్లగలదు. ఇది
డీఆర్డీవో ఆధ్వర్యంలో తయారైన తొలి క్షిపణి.
యుద్ధనౌక ఐఎన్ఎస్ చెన్నై
ప్రారంభం
}కోల్కతా తరగతికి చెందిన క్షిపణి విధ్వంసక యుద్ధనౌక
ఐఎన్ఎస్ చెన్నైని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నవంబర్ 21న ముంబైలో
ప్రారంభించారు.
}దీనిపై సూపర్సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులు, బరాక్-8 దీర్ఘ
శ్రేణి క్షిపణులను
మోహరించొచ్చు
అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతం
}స్ట్రాటజిక్ ఫోర్సెస్ ఆఫ్ కమాండ్ ఆధ్వర్యంలో ఒడిశాలోని వీలర్
ఐలాండ్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి నవంబర్ 22న జరిపిన అగ్ని-I క్షిపణి ప్రయోగ పరీక్ష
విజయవంతమైంది.
}ఈ మిస్సైల్ 500 కిలోల బరువు గల న్యూక్లియర్ వార్హెడ్ను
మోసుకెళ్లగలదు. 12 టన్నుల బరువు, 15 మీటర్ల పొడవుతో ఉన్న ఈ క్షిపణి దాదాపు 750
కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలుగుతుంది.
}రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఈ క్షిపణిని
రూపొందించింది. అగ్ని-1ను చివరిసారిగా 2016 మార్చి 14న ఇదే వేదిక నుంచి విజయవంతంగా
పరీక్షించారు
క్షిపణి విధ్వంసక నౌక
‘మోర్ముగావో’ ప్రారంభం
}పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక క్షిపణి విధ్వంసక యుద్ధనౌక
ఐఎన్ఎస్
‘మోర్ముగావో’ను సెప్టెంబర్ 17న ప్రారంభించారు.
}ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) తయారు చేసిన
ఈ నౌకను నావికా దళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా సతీమణి రీనా ప్రారంభించి అరేబియా
సముద్రంలోకి జలప్రవేశం చేశారు.
}మోర్ముగావో నుంచి ఉపరితలం నుంచి ఉపరిత లానికి, ఉపరితలం నుంచి
గగనతలానికి క్షిపణులను, జలాంతర్గామి విధ్వంసక రాకెట్లను ప్రయోగించవచ్చు. ఇది
7,300 టన్నుల సామర్థ్యంతో గరిష్టంగా గంటకు 30 నాటికల్ మైళ్ల వేగంతో
ప్రయాణిస్తుంది.
ఇజ్రాయెల్-భారత్
ఎంఆర్-శామ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
}భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల మీడియం రేంజ్ మిస్సైల్ (ఎంఆర్-శామ్)ను
ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి పరీక్షించారు.
}దీన్ని హైదరాబాద్లోని డీఆర్డీవో శాస్త్రవేత్తలు, ఇజ్రాయెల్కు చెందిన
ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి
No comments:
Post a Comment