}అమెరికా 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్
పార్టీ అభ్యర్థి డొనాల్డ్ జాన్ ట్రంప్ ఘనవిజయం సాధించారు.
}నవంబర్ 8న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్
ఓట్లలో ట్రంప్కు
305 ఎలక్టోరల్
ఓట్లు రాగా, ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్కు 232 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి.
}పాపులర్ ఓట్లలో హిల్లరీ 47.7 శాతం (5,93,21,645),
ట్రంప్ 47.5
శాతం
(5,91,50,974) సాధించారు.
}ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్ 2017, జనవరి 20న వాషింగ్టన్ డీసీలో
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తారు.
}రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త అయిన 70 ఏళ్ల ట్రంప్ 18
నెలల కిందటే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చారు.
}ఈ ఎన్నికల్లో ఐదుగురు భారత సంతతి అమెరికన్లు విజయం
సాధించారు.
}కమలా హ్యారిస్ (51):ఈమె రెండు సార్లు
కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా బాధ్యతలు నిర్వహించారు. తాజా ఎన్నికల్లో అమెరికా
సెనేట్కు ఎంపికయ్యారు.
}ప్రమీల జయపాల్: హౌజ్ ఆఫ్
రిప్రజెంటేటివ్సకు ఎంపికై న తొలి భారతీయ-అమెరికన్గా ప్రమీల (51) రికార్డు
నెలకొల్పారు. సియాటెల్ నుంచి ఈమె ప్రతినిధుల సభకు ఎంపికయ్యారు.
}రాజా కృష్ణమూర్తి: రాజా
కృష్ణమూర్తి ప్రతినిధుల సభకు అర్హత సాధించారు. ఇల్లినాయిస్లోని 8వ డిస్ట్రిక్ట్
నుంచి పోటీ చేసిన కృష్ణమూర్తి (42) 2000, 2004ల్లో ఒబామా యూఎస్ సెనేట్ ప్రచారంలో
కీలక బాధ్యతలు నిర్వహించారు.
}రోహిత్ ఖన్నా: డెమొక్రటిక్
పార్టీ అభ్యర్థి అయిన ఖన్నా (42) కాలిఫోర్నియాలోని 17వ డిస్ట్రిక్ట్ నుంచి హోండాపై
విజయం సాధించారు.
}అమీ బెరా: డెమొక్రటిక్
పార్టీ తరపున సాక్రమెంటో కౌంటీ నుంచి బరిలో దిగిన అమీ బెరా విజయం సాధించారు. ఈమె
2012, 2014 ఎన్నికల్లోనూ విజయం సాధించారు.
దీంతో గతంలో మూడుసార్లు
కాంగ్రెస్కు ఎంపికై న భారతీయుడు దలీప్ సింగ్ సౌంద్ రికార్డును బెరా సమం చేశారు.
జిందాల్ కూడా 2004, 2006లో రెండుసార్లు లూసియానా గవర్నర్గా ఎంపికయ్యారు.
No comments:
Post a Comment