Friday, February 24, 2017
Wednesday, February 22, 2017
Monday, February 20, 2017
Friday, February 17, 2017
Wednesday, February 15, 2017
Thursday, February 9, 2017
Wednesday, February 8, 2017
Tuesday, February 7, 2017
Monday, February 6, 2017
Sunday, February 5, 2017
Saturday, February 4, 2017
వార్ధా తుఫాను
}పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానుకు వర్దా అని పేరు పెట్టారు.
}వర్దా అంటే అరబిక్, ఉర్దూ భాషల్లో గులాబీ అని అర్థం.
}ఈ పేరును పాకిస్తాన్ సూచించింది.
}ఈ పెను తుపాను డిసెంబర్ 12న తమిళనాడు లో చెన్నై కి సమీపంలో తీరం దాటింది.
}దీని ధాటికి తమిళనాడు అతలాకుతలం అయింది.
}డిసెంబర్ 12న తీరం దాటిన తుపాను వల్ల గంటకు 129 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో చెన్నైతో పాటు తీరప్రాంతాల్లో 18 మంది మృతి చెందారు.
}రూ.1,000 కోట్ల నష్టం సంభవించిందని అంచనా.
జయలలిత మృతి
}జయలలిత (జ.ఫిబ్రవరి 24, 1948-- మ.డిసెంబరు 5, 2016) ప్రముఖ రాజకీయనాయకురాలు మరియు తమిళనాడు రాష్ట్రానికి మే 2015 నుంచి డిసెంబరు 2016లో మరణించే దాకా ముఖ్యమంత్రిగా పనిచేసింది.
}అంతకు మునుపు 1991 నుంచి 1996, 2001 లో కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది.
}రాజకీయాలలోకి రాకమునుపు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించింది.
}ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. జానకి రామచంద్రన్ తరువాత ఆమె తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి.
}ఆమె 2016, డిసెంబరు 5, రాత్రి 11:30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించింది. అంతకు మునుపు సుమారు రెండున్నర నెలలుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలోనే ఉంది.
}జయలలిత అసలు పేరు కోమలవల్లి.
}జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానంసంపాదించిరి.
}1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది.
}ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది.
}అభిమానులు జయలలితను అమ్మ అని, పురచ్చి తలైవి (విప్లవాత్మక నాయకురాలు) అని పిలుస్తుంటారు.
}1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారముతో సత్కరించింది.
}ఈమె అవివాహిత గానే జీవితాన్ని గడిపారు.
న్యూజిలాండ్, దక్షిణ కొరియా, ఇటలీ లలో జరిగిన రాజకీయ మార్పులు
భిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షురాలు
}దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గియోన్ హై అభిశంసనకు గురయ్యారు. పార్క్ పై విపక్షాలు డిసెంబర్ 9న ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ లభించింది.
}ఆ దేశ పార్లమెంటులో 300 స్థానాలుండగా.. 234 మంది అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపారు.
}దక్షిణ కొరియా అధ్యక్ష స్థానాన్ని చేపట్టిన తొలి మహిళ పార్క్.
ఇటలీ ప్రధాని రెంజీ రాజీనామా
}పార్లమెంటరీ సంస్కరణలతోపాటు కొన్ని ప్రాంతీయ అధికారాలను జాతీయ ప్రభుత్వానికి బదలాయించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణపై జరిగిన రెఫరెండంలో ఓడిపోవడంతో పదవి నుంచి దిగిపోతున్నట్లు ఇటలీ ప్రధాని మేటూ రెంజీ ప్రకటించారు.
}డిసెంబర్ 4న జరిగిన రెఫరెండంలో దాదాపు 70 శాతం మంది ఓటు వేయంగా 59.5 శాతం మంది రెఫరెండంకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఇటలీ ప్రధానిగా జెంటిలోని
}డెమోక్రటిక్ పార్టీ నేత పాలో జెంటిలోని నేతృత్వంలో డిసెంబర్ 11న ఇటలీలో నూతన మంత్రివర్గం ఏర్పాటైంది.
}ప్రధాని పదవికి మేటూ రెంజి రాజీనామా చేయడంతో జెంటిలోని కొత్త ప్రధానిగా ఎంపికయ్యారు
న్యూజిలాండ్ ప్రధాని రాజీనామా
}న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ తన పదవికి డిసెంబర్ 5న రాజీనామా చేశారు.
}2002లో పార్లమెంటులో తొలిసారి అడుగు పెట్టిన జాన్కీ నాలుగేళ్ల తర్వాత నేషనల్ పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు.
}తర్వాత 2008లో లేబర్ పార్టీపై గెలుపొంది ప్రధాని అయ్యారు.
}న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా బిల్ ఇంగ్లిష్ డిసెంబర్ 12న వెల్లింగ్టన్లో ప్రమాణస్వీకారం చేశారు.
క్యూబా లో ఫిడెల్ క్యాస్ట్రో మృతి
}క్యూబా విప్లవ యోధుడు, మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో (90) అనారోగ్యంతో నవంబర్ 26న మృతి చెందారు.
}కొన్ని ఆరోగ్య సమస్యసలతో 2008లో అధ్యక్ష బాధ్యతలను తన సోదరుడు రౌల్ క్యాస్ట్రోకి అప్పగించారు.
}1926 ఆగస్టు 13న ఫిడెల్ క్యాస్ట్రో క్యూబాలో జన్మించారు. హవానా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివిన క్యాస్ట్రో.. 1953లో శాంటియాగోలోని మొన్కాడా మిలటరీ బ్యారక్లపై మొదటిసారి దాడి చేసి జైలుకెళ్లాడు.
}15 సంవత్సరాలు శిక్ష పడగా క్షమాభిక్షపై 19 నెలలకే బయటకు వచ్చి 1959 జనవరి 8న క్యూబా నియంత ఫుల్జెనికో బటిస్టాపై తిరుగుబాటు చేసి క్యూబాను హస్త్తగతం చేసుకున్నారు.
}1959 నుంచి 1976 వరకు క్యూబా ప్రధానమంత్రిగా ఉన్న క్యాస్ట్రో.. అనంతరం దేశాధ్యక్షుడిగా ఎన్నికై 2008 వరకు ఆ పదవిలో కొనసాగారు.
}ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో క్యూబన్ల జీవితాల గురించి 1960లో 269 నిమిషాలసేపు క్యాస్ట్రో చేసిన ప్రసంగం ఇప్పటికీ ప్రపంచ రికార్డుగా ఉంది.
విశాఖపట్నం లో జరిగిన IFR-2016
}11వ అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శన (ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ - ఐఎఫ్ఆర్) ఫిబ్రవరి 4న విశాఖపట్నంలో ప్రారంభమైంది.
}ఈ ఐఎఫ్ఆర్ను తొలిసారిగా దేశ తూర్పు తీరంలో నిర్వహించారు.
}ఈ కార్యక్రమంలో 51 దేశాలు పాలుపంచుకున్నాయి.
}త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫిబ్రవరి 6న యుద్ధనౌకల సమీక్ష నిర్వహించారు.
}ఐఎన్ఎస్ సుమిత్రలో ఆయన నౌకాదళ సిబ్బంది సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ ప్రదర్శనలో ఐఎన్ఎస్ రణ్వీర్, విక్రమాదిత్య, విరాట్, శివాలిక్, మైసూర్ మొదలైన యుద్ధనౌకలతో పాటు సింధురాజ్, సింధుకారి, సింధువీర్ జలాంతర్గాములు కూడా పాల్గొన్నాయి.
}భారత్కు చెందిన 65 యుద్ధనౌకలతో పాటు 24 దేశాలకు చెందిన యుద్ధనౌకలు ఇందులో పాల్గొన్నాయి
}ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ‘సముద్ర జలాలపై శాంతి, సుస్థిరత తీరప్రాంత దేశాల సమష్టి బాధ్యత’ అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమైన పథకాలు
జన్మభూమి కమిటీలకు గ్రామసభల నిర్వహణ అధికారం
}ఆంధ్రప్రదేశ్లో గ్రామసభల నిర్వహణ అధికారాన్ని జన్మభూమి కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
}ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 21న జరిగిన కలెక్టర్ల సమావేశంలో అధికారులను ఆదేశించారు.
}గ్రామసభ అంటే?
గ్రామంలోని
ఓటర్లు ప్రతి ఏటా విధిగా నాలుగు సార్లు సమావేశం కావాలి. దీన్నే గ్రామసభ అంటారు.
}సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించాలి.
}1994 పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 6 ప్రకారం గ్రామసభలకు స్థానిక సర్పంచ్ అధ్యక్షత వహించాలి.
}సర్పంచ్ లేకపోతే ఉపసర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించాలి.
ఏపీలో ‘పురసేవ’ యాప్ ఆవిష్కరణ
}పట్టణ ప్రాంత ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి వీలుగా ‘పురసేవ’ పేరుతో రూపొందించిన మొబైల్ యాప్ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నవంబర్ 30న ఆవిష్కరించారు.
}ప్రజలెవరైనా ఈ యాప్ ద్వారా తమ ప్రాంతంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. దీంతో అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటారు.
ఇంధన పొదుపులో ఏపీ నెంబర్ 1
}ఇంధన పొదుపు అమలులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో వరుసగా రాజస్థాన్, కర్నాటక, మహారాష్ట్ర ఉన్నాయి.
}ఈ మేరకు ఇంధన పొదుపుపై వరల్డ్ బ్యాంక్ రూపొందించిన ర్యాంకుల నివేదికను నవంబర్ 4న ప్రకటించారు.
}గృహ వినియోగదారులకు ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేయడం, వీధి దీపాలను ఎల్ఈడీ దీపాలతో మార్చడం, స్టార్ రేటెడ్ ఫ్యాన్ల పంపిణీ వంటి కార్యక్రమాల వల్ల 650 మెగావాట్ల ఇంధన పొదుపు జరిగి ఏపీలో రెండేళ్ళలో 1500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయిందని నివేదిక పేర్కొంది.
చంద్రన్న బీమా యోజన ప్రారంభం
}ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న బీమా పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో అక్టోబరు 2న ప్రారంభించారు.
}15 నుంచి 70 ఏళ్ల లోపు వారు దీనికి అర్హులు.
}బీమా చెల్లించిన వ్యక్తి చనిపోయినా, పూర్తిగా వికలాంగుడైనా వెంటనే రూ.7 వేలు, మూడు వారాల్లోగా రూ.ఐదు లక్షలు కుటుంబానికి అందిస్తారు.
}ఇందుకోసం 155214 టోల్ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశారు
ఏపీ పర్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
}ప్రజలను డిజిటల్ ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్ది, వారిని నగదు రహిత లావాదేవీల వైపు మళ్లించేందుకు వీలుగా ఏపీ పర్సును ఏపీ సీఎం చంద్రబాబు డిసెంబర్ 6న ప్రారంభించారు.
}ఏపీ పర్సు మొబైల్ యాప్లో 13 మొబైల్ బ్యాంకింగ్, 10 ఈ-వ్యాలెట్ సంస్థలు తమ యాప్లను పొందుపర్చాయి.
కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన వివిధ రకాల ఆర్డినెన్సులు
ఓబీసీల్లోకి 15 కొత్త కులాల చేరికకు కేంద్రం ఆమోదం
}ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) కేంద్ర జాబితాలో మార్పుచేర్పులకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30న ఆమోదం తెలిపింది.
}ఇందులో కొత్తగా 15 కులాలను చేర్చడంతోపాటు మరో 13 ఇతర కులాల్లో ప్రతిపాదించిన మార్పులకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలియజేసింది.
ఎయిడ్స్’ రోగులపై వివక్షకు రెండేళ్ల జైలు
}హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపితే 3 నెలల నుంచి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించాలని కేంద్రం నిర్ణయించింది.
}ఈ మేరకు హెచ్ఐవీ, ఎయిడ్స్ బిల్లు 2014 (సవరణలు)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
}ఈ బిల్లు అమల్లోకి వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా యాంటీ రిట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ)ని ఏర్పాటు చేయాలి.
బాంబే, మద్రాసు హైకోర్టుల పేర్ల మార్పు
}బాంబే, మద్రాసు హైకోర్టుల పేర్ల మార్పునకు సంబంధించి న్యాయ శాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ జూలై 5న ఆమోదం తెలిపింది.
}దీంతో ఇకపై బాంబే హైకోర్టును ముంబై హైకోర్టుగా, మద్రాసు హైకోర్టును చెన్నై హైకోర్టుగా పిలవనున్నారు.
}కలకత్తా హైకోర్టును కూడా కోల్కతా హైకోర్టుగా మార్చనున్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
పారిస్ ఒప్పందాన్ని ధ్రువీకరించిన భారత్
}పారిస్ ఒప్పందాన్ని భారత్ అక్టోబర్ 2న ధ్రువీకరించింది.
}ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేసిన పత్రాన్ని ఐరాసలోని భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఐక్యరాజ్యసమితి ఒప్పందాల విభాగాధిపతి శాంటియాగో విల్లాల్పండోకు అందించారు.
మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
}భారీ ఓడరేవు అధికారాల (మేజర్ పోర్ట్ అథారిటీస్) బిల్లు- 2016కు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 14న ఆమోదం తెలిపింది.
}నిర్ణయాలు తీసుకోవడంలో పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పించడం ద్వారా ఓడరేవుల నిర్వహణ నైపుణ్యం, సామర్థ్యాలను పెంచేందుకు తాజా బిల్లు ఉపయోగపడనుంది.
}నౌకాయాన శాఖ చేసిన ప్రతిపాదన మేరకు కేంద్రం ప్రధాన ఓడరేవు ధర్మకర్తల మండళ్ల చట్టం-1963 స్థానంలో తాజా బిల్లును తెచ్చింది
మోటారు సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
}మోటారు వాహనాల (సవరణ) బిల్లు-2016కు కేంద్ర కేబినెట్ ఆగస్టు 3న ఆమోదం తెలిపింది.
}18 రాష్ట్రాల రవాణా మంత్రుల సిఫార్సుల మేరకు ఈ బిల్లును రూపొందించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు.
}ఈ బిల్లు ప్రకారం అర్హత లేకుండా వాహనం నడిపితే కనీసం రూ.10 వేల జరిమానా చెల్లించాలి.
}ప్రమాదకర డ్రైవింగ్కు రూ.5000, తాగి వాహనం నడిపితే రూ.10 వేలు, సీటు బెల్టు పెట్టుకోకుంటే రూ.1000 జరిమానా విధిస్తారు. హిట్ అండ్ రన్ కేసుల్లో రూ.2 లక్షల జరిమానాతోపాటు ప్రమాద మృతులకు రూ.10 లక్షల వరకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది
మోడల్ షాప్ చట్టానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
}దేశంలో 24 గంటలు, 365 రోజులూ దుకాణాలు తెరిచి ఉంచేలా ‘ద మోడల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ (ఉద్యోగం, సేవల వసతి నియంత్రణ) చట్టం-2016’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
}దీని ప్రకారం.. పదిమంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న దుకాణాలు, కంపెనీలు (తయారీ సంస్థలు తప్ప) ఏడాదిపాటు దుకాణాలు తెరిచి ఉంచుకోవచ్చు.
}ఎప్పుడు కావాలంటే అప్పుడు దుకాణాలు తెరుచుకోవచ్చు.
}దీంతో పాటు సరైన భద్రత కల్పించటం ద్వారా రాత్రి షిఫ్టులో మహిళలను పనిలో పెట్టుకోవచ్చు.
}ఇవన్నీ చేయాలంటే ఉద్యోగులందరికీ సరైన తాగునీరు, క్యాంటీన్, శిశు సంరక్షణ కేంద్రం, ప్రాథమిక చికిత్సతోపాటు మరుగుదొడ్డిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
}కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం అక్కర్లేదు. ఇది నేరుగా అమల్లోకి వస్తుంది
Subscribe to:
Posts (Atom)